అమరవీరుల దినోత్సవం... షహీద్ భగత్ సింగ్ కు సీఎం జగన్ నివాళి

Mar 23, 2022, 5:05 PM IST

అమరావతి: అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి  సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.