ప్రత్యేక ప్రసాదాలివే..
ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన పిండిని స్వామివారికి సమర్పిస్తారు. సోమవారం విశేష పూజ సందర్బంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వామివారికి నివేదిస్తారు. మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును నివేదిస్తారు. గురువారం జిలేబి, మురుకు, పాయసాలను నైవేద్యంగా చెల్లిస్తారు. శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలను సమర్పిస్తారు. శనివారం కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్దోజనం, మిర్యాలపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదన చేస్తారు.