రైతులకు ముందస్తు నోటీసులు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Jan 18, 2020, 3:49 PM IST

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో  పోలీసులు రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, జైల్ భరో కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు. దీంతో  సమావేశాలు జరిగే రోజున ఎటువంటి ఆందోళనలకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 29 గ్రామాల్లో రైతులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.