దసరా ఉత్సవాలకు అంతా సిద్ధం.. కానీ వారికి మాత్రమే అనుమతి...

Sep 19, 2020, 6:25 PM IST

దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. యేటా నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతుంటాయి. శరన్నావరాత్రుల్లో అమ్మవారు ప్రత్యేకమైన అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గ గుడి పరిసరాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు.