సింహాచలం నరసింహస్వామి సన్నిధిలో నారా లోకేష్

Mar 4, 2021, 1:24 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన  సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో ప్రారంభమయ్యింది. నేరుగా సింహాచలం ఆలయానికి చేరుకున్న లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజువాక లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు లోకేష్. టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు,ముఖ్య నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టిడిపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి ఓటు వెయ్యాలని కోరారు. ఆ తర్వాత గాజువాకలోనే రోడ్ షో లో నిర్వహించారు లోకేష్.