హత్యారాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు.. వెల్లంపల్లి శ్రీనివాస్..

Jun 27, 2020, 4:36 PM IST

నారా లోకేష్ చౌదరికి, చంద్రబాబు కు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు.. కానీ అవినీతికి పాల్పడిన టీడీపీ గజదొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని, పేదల కష్టార్జితని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటంబాన్నిపరామర్శించారు. ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బైట పెడతారని భయంతో లోకేష్ అచ్చెన్నాయుడు కుటంబ సభ్యులను పరామర్శించారు.నిలువుగా అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు..ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం జగన్ నిజమైన బాహుబలి అన్నారు.