ఏపీలో ఏరువాక పౌర్ణమి వేడుకలు... నాగలి పట్టి భూమిదున్నిన మంత్రి అంబటి

Jun 15, 2022, 11:28 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిన్న(మంగళవారం) జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా ముస్తాబుచేసిన ఎద్దులకు కట్టిన నాగలిని పట్టి భూమిని దున్నారు మంత్రి. దోతి, లాల్చీ ధరించి తెలుగు సాంప్రదాయ వేషధారణలో ఈ ఏరువాక వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి సరదాగా కోలాటం ఆడారు.