స్వస్థలాలకు పంపించాలంటూ వలసకార్మికుల ఆందోళన.. దాచేపల్లిలో ఉద్రిక్తత...

May 4, 2020, 4:25 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వలసకూలీల ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తమ స్వస్థలాలకు పంపించాలని కర్నూల్ జిల్లా కు చెందిన దాదాపు 300ల మంది వలస కూలీలు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధకారులు ఆదేశాలిస్తే కానీ ఏమీ చేయలేం అంటున్న పోలీసులు, అంతేకాదు వెళ్లడానికి ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి పాసులు జారీ చెయ్యలేదని చెప్పారు. ఈ విషయమే వలస కూలీలతో మాట్లాడి పోలీసులు వారిని వెనక్కి పంపించారు.