సర్వదర్శనం టికెట్లు కోసం బారులు తీరిన భక్తులు

Jun 12, 2020, 5:17 PM IST

తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర జనాలు బారులు తీరారు. అయితే అనుబంధ ఆలయమైన గోవిందరాజస్వామి గుడిలోని ఓ ఉద్యోగికి కరోనా నిర్థారణ కావడంతో ఆలయానికి భక్తుల ప్రవేశం రెండు రోజులు నిలిపివేశారు. ఆలయంతో పాటు ఉద్యోగి తిరిగిన ప్రాంతాలను రెండు రోజులు మూసేసి, ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత తెరుస్తామని చెప్పారు.