పోలీస్ స్టేషన్ ముందే వేటకొడవళ్లతో దాడి.. తలలు పగిలి నరకం...

Jun 11, 2020, 10:31 AM IST

కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నదమ్ముల మధ్య పొలం విషయమై గొడవలొచ్చి జొన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఇరువర్గాల బంధువులు అక్కడికి రావడంతో అన్నదమ్ముల మధ్య  మాటా మాటా పెరిగి ఘర్షణలకు దారి తీసింది. ఇరువర్గాల బంధువులు వేటకొడవళ్లతో ఒకరిపై ఒకరు స్టేషన్ దగ్గరే దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. జొన్నగిరి లో పరిస్థితి అదుపు చేయడానికి  సిఐ ఆదినారాయణ రెడ్డి అదనపు పోలీసులను రంగంలోకి దించారు.