JC Diwakar Reddy : పాక్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​లో కలిపితేనే...

Jan 6, 2020, 8:33 PM IST

ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​లో కలిపితే తాను భాజపాలో చేరుతానన్నారు. ఇది తన స్వార్థం కోసం కాదని, దేశం కోసమేనని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు చంద్రబాబుతోనే కలసి ఉంటానని దివాకర్​రెడ్డి స్పష్టం చేశారు.