విజయవాడ కోర్టులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రమాదం

Feb 24, 2022, 11:03 AM IST

విజయవాడ బీసెంట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసారు. ఇదే కాంప్లెక్స్ లో బ్యాంక్ తో పాటు మరికొన్ని కార్యాలయాలు వున్నాయి. వీటిలోకి మంటలు వ్యాప్తిచెందకుండా అదుపు చేయడంతో మరింత ప్రమాదం తప్పింది.