రిషబ్ పంత్ రనౌట్ కు కోహ్లీకి ఏంటి సంబంధం?
న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 77(65) పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. దీని తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ కేవలం మూడు బంతులు ఆడి రనౌట్ అయ్యాడు. ఇది ఇన్నింగ్స్ 23వ ఓవర్ రెండో బంతికి జరిగింది.
అజాజ్ పటేల్ వేసిన బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు ఆడిన కోహ్లీ, పరుగు చేసే ప్రయత్నంలో కోహ్లి పంత్కి కాల్ ఇచ్చి పరిగెత్తుతాడు. పంత్ అవతలి ఎండ్ లో నిలబడి ఉన్నాడు. వెంటనే సింగిల్ తీయడానికి పరిగెత్తాడు, కానీ అతను మరో ఎండ్కు చేరుకునే సమయానికి, ఫీల్డర్ బంతిని కీపర్ వైపు విసిరాడు.. పంత్ రనౌట్ అయ్యాడు. పరుగు రావడం కష్టంగా, అవసరం లేని సమయంలో విరాట్ పరుగుకు కాల్ ఇవ్వడంతో పంత్ రనౌట్ అయ్యాడని చెప్పవచ్చు.