ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, రజనీకాంత్ ఆరోగ్యం కోసం శ్రీదేవి ఇదంతా చేశారట. 2011లో ప్రముఖ నటుడు రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న శ్రీదేవి, షిరిడీ సాయిబాబా పేరు మీద ఉపవాసం ఉన్నారు.
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు. పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు.
2011లో రజనీకాంత్ ఆరోగ్యం చాలా దిగజారినప్పుడు, ఆయన రవికుమార్ దర్శకత్వంలో రానా సినిమా షూటింగ్లో ఉన్నారు. అయితే, శ్రీదేవి ఉపవాసం, అందరి అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ తిరిగి ఆరోగ్యం పొందారు.