Jan 4, 2020, 4:56 PM IST
మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా మందడంలో రైతులు ఉదయమే రహదారిపైకి వచ్చి నిరసన చేపట్టారు. పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణచేయాలని నిర్ణయించారు. మంచినీళ్లు సహా, ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని, తమ దుకాణాల ముందు కూర్చొటానికి కూడా వీల్లేదని స్పష్టం చేశారు. తమ గ్రామం మీదుగా పోలీసు వాహనాలు వెళ్లడానికి వీల్లేదని రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం
జరిగింది. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింపచేశారు.