ప్రభాస్ తో చేస్తున్నా బికినీ ఫొటో షూట్స్ కు బ్రేక్ ఇవ్వలా..ఎక్కడ చూసినా ఈ ఫొటోలే

First Published May 5, 2024, 7:32 AM IST

హీరోయిన్ గా  కంటే కూడా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. 

Disha Patani

సాధారణంగా ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్ ప్రక్కన చేస్తున్నప్పుడు కెరీర్ విషయంలో ఆచి,తూచి వెళ్తూంటారు. ముఖ్యంగా తమ గురించి పొటోలు, న్యూస్ లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. గ్లామర్ షో కు కాస్తంత దూరంగానే ఉంటారు. కానీ దిశా పటానీ అలాంటివేమీ పట్టించుకునేలా లేదు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

అందుకే దిశా పటాని అనగానే వెంటనే ఆమె చేసిన సినిమాలు గుర్తుకు రావు. ఆమె హాట్ పిక్స్ మైండ్ లో మెదులుతాయి. అంతలా ఆమె హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతూంటుంది. సినిమాలపైన కన్నా వాటిపైనే దృష్టి ఎక్కువని విమర్శలు వచ్చినా లెక్క చెయ్యదు. తను అనుకున్నట్లుగా కెరీర్ ని మలుచుకుంటూ ముందుకు వెల్తోంది. తాజాగా ఆమె బీచ్ లో ఓ ఫొటో షూట్ కు హాజరైంది.  

దిశా మాట్లాడుతూ...తన కుటుంబం తను చేసే సినిమా లను ఎప్పుడు గమనిస్తూ ఉంటుందని చెప్తోంది.  తను సినిమా లలో ఎలాంటి పాత్రలు చేసినా, అది నా వృత్తిలో భాగమే అని వాళ్ళకి తెలుసు అన్నారు. అయితే   పొట్టిబట్టల్లో హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో, వాళ్ళ ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ నాన్న ఇబ్బందిగా ఫీలవుతారని చెప్తోంది. ఎంతైనా నాన్న కదా అంటుంది ఈ బ్యూటీ. ఇంస్టాగ్రామ్ లో తన ఫొటోస్ ని వాళ్ళ అమ్మ గారు, చూస్తారట కానీ, ఆ ఫొటోలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరట. 

తెలుగులో నటించిన 'లోఫర్' సినిమాకుగానూ అమ్మడికి ఇక్కడ కెరీర్ లేకుండా పోయింది. తర్వాత పూరి జగన్నాథ్ సైతం ఆమెను పట్టించుకోలేదు.  కొంతమంది తెలుగు నిర్మాతలు ఆమెను ట్రై చేసారు ...కానీ సౌత్ సినిమాలపై ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పేసింది.

బాలీవుడ్‎లోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అవకాశాలు దక్కించుకునే పనిలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఆ తర్వాత అవే తమ జీవితం అన్నట్లు వరస ఫొటో షూట్స్ చేసుకుంటూ పోయింది.

అప్పట్లో   తోటి నటుడు టైగర్ ష్రాఫ్‎తో లవ్ ఎఫైర్‎తో పాటు కొన్ని మ్యాగజైన్లకు ఫోటో షూట్స్ ఇవ్వడం ద్వారా అమ్మడికి అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.ఆమెకు వచ్చిన పబ్లిసిటీని, క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావించిన దిశా సౌతిండియన్ మూవీ మేకర్లకు షాక్ ఇస్తోందట. ఊహించని స్దాయిలో రెమ్యునేషన్ చెప్పి భయపెడుతోందిట.


బాలీవుడ్‌లో  ఉన్న అదిరిపోయే అందగత్తెల్లో దిశా పటానీ ఒకరు. అయితే ఆ అందం దిశాను స్టార్‌ హీరోయిన్‌ని చేయలేకపోయింది. కానీ ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేస్తుంది. అలాగే యాడ్స్ లో బిజీ చేస్తుంది. అప్పుడప్పుడూ బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తున్నా, దక్షిణాదిన మాత్రం పాగా వేయలేకపోయింది. తొలి సినిమా  ‘లోఫర్’ ఫ్లాప్‌ కావడంతో దిశా మరోసారి తెలుగులో నటించే ధైర్యం చేయలేదు.

మా సినిమాలో నటించమని అడిగిన వాళ్లకు ఓ కోటిన్నర ఇచ్చుకోండి అని చెబుతోందట ఈ హాట్ బ్యూటీ. అమ్మడు చెప్పిన ఫిగర్ విన్న వాళ్లంతా మళ్లీ ఆమె గురించి ఆలోచించడానికి కూడా భయపడిపోతున్నారని సమాచారం.

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. తరచుగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే దక్షిణాది ఆఫర్లను తిరస్కరించాలనే ఉద్దేశంతోనే అప్ కమింగ్ బ్యూటీ ఈ రేంజ్‎లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

కెరీర్‎లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా నమోదు చేయలేకపోయిన ఆ హాట్ బ్యూటీ తన రెమ్యూనరేషన్‎తో నిర్మాతలను భయపెడుతోండటం చిత్రంగా ఉందంటున్నారు.ఏదేమైనా దిశా మరీ ఇంత రెమ్యునేషన్ అడగడానికి అసలు కారణం ఏమిటో ఆమెకే తెలియాలి.

బాఘీ జోడీ దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌లు డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్నా దీనిపై వీరిద్దరూ ఇంతవరకూ నోరుమెదపలేదు. దిశా, టైగర్‌లు కలిసి అనేక సందర్భాల్లో  కెమెరాల కంటపడుతూనే ఉన్నారు. వీరిద్దరూ ఈ  శ్రీలంకలో ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలు వచ్చాయి.  

టైగర్‌ ష్రాఫ్‌ తనకు మంచి స్నేహితుడని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చారు. టైగర్‌ పాటించే నియమాలు, పని పద్ధతులు ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. టైగర్‌ అందరికీ ఆదర్శప్రాయుడుని కితాబిచ్చింది కానీ అసలు విషయం దాటేసింది.

కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆకర్షిస్తోంది. 

ఇలాంటి ఫొటో షూట్స్ తో ఆమెకు క్రేజ్ తో పాటు సమస్యలూ వస్తున్నాయి.  టాలెంట్ లేనివారే స్కిన్ షోతో ఆకట్టుకుంటారని ఓపెన్ గానే కామెంట్లు పెడుతున్నారు. దీంతో దిశా పటానీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఫొటోలపైన విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

ఏదైమైానా   దిశా పటానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘కల్కి 2898 ఏడీ’  లాంటి పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్టున్నా ఇలాంటి ట్రోల్స్ జరగడం హాట్ టాపిక్ గ్గా మారింది. మొత్తానికి దిశా పటానీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.

Disha Patani


అయితే హీరోయిన్ గా  కంటే కూడా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. 40 మిలియన్ ఫ్యాన్స్ ని ఇనిస్ట్రగ్రమ్ లో కలిగి ఉన్న ఆమె అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకోసం ప్రత్యేకమైన ఫొటో షూట్స్ కు హాజరు అవుతూంటుంది. తాజాగా థాయిలాండ్ బీచ్ లో ఆమె బికినీ వేసి అందాల ప్రదర్శన పెట్టింది.

click me!