దారుణం : కొండమీద..అనాథలా..మట్టిలో పాతిపెట్టింది...

Feb 12, 2020, 3:29 PM IST

కుటుంబకలహాలతో చనిపోదామని తన 18నెలల కూతురితో కొండమీదికి వెళ్లిన కుసుమలత 10వతేదీన దొరికిన విషయం తెలిసిందే. అయితే పాప చనిపోయిందని పాతిపెట్టానని చెప్పిన కుసుమలత, ఎక్కడ పాతిపెట్టిందో మాత్రం చెప్పలేకపోయింది. దీంతో గత రెండు రోజులుగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు పాప శవాన్ని కనిపెట్టారు.