Jun 12, 2020, 12:42 PM IST
జగన్ ఏడాది పాలనలో టీడీపీ నాయకులను అరెస్టులు చేయడానికే సరిపోయిందంటూ మాజీ హోం మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప జగన్ ను దుయ్యబట్టారు. పిలిస్తే వచ్చే ఆయన్ని దారుణంగా అరెస్టు చేయడం అన్యాయం అని అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. సంవత్సరంలో అభివృద్ధి శూన్యం, తెలుగుదేశాన్ని నాశనం చేయడమే ధ్యేయం అంటూ మండిపడ్డారు.