పార్వతీపురం మన్యంలో ఏనుగుల గుంపు బీభత్సం...మూగజీవి మృతి

May 14, 2022, 11:38 AM IST

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత అర్ధరాత్రి జియ్యమ్మవలస మండలం రాజీ పేట గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అయితే ఈ ఏనుగుల దాడిలో గ్రామస్తుల్లెవ్వరికీ ఎలాంటి హాని జరగకున్న ఓ మూగజీవి బలయ్యింది. ఓ లేగదూడపై ఏనుగుల గుంపు దాడిచేసి చంపేసింది. ఏనుగుల గుంపు దాడి చెయడంతో రాజీపేట గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.