Jan 2, 2020, 11:04 AM IST
రాజధాని రైతులకు మద్ధతు తెలుపుతూ వారికి తన చేతి బంగారు గాజులను ఇచ్చిన నారా భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఇవ్వాల్సింది గాజులు కాదని.. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన రైతుల భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇంట్లోంచి బయటకు రాని మీరు ఇవాళ మీ భూములు కోసం మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకుల భూములు కోసం బయటకు వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.