అహోబిలంలో చిరుత కలకలం.. నడిరోడ్డుపై దర్జాగా పడుకుని...

Jun 9, 2020, 10:22 AM IST

ఆళ్ళగడ్డ నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్లేదారిలో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డుపై చిరుత పులి ఠీవీగా కూర్చుని కనిపించింది. దీంతో అటుగా వెల్తున్న వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ చిరుత గతంలో కూడా చాలాసార్లు  అక్కడ కనిపించిందని, పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు.  అహోబిలానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఈ చిరుతను గమనించి వీడియో తీసి,  ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు.