పాలాభిషేకం : మండలి చైర్మన్ ఫొటోకు పాలాభిషేకం చేసిన రైతులు...

Jan 23, 2020, 1:26 PM IST

అమరావతిలో  రాజధాని రైతుల ఆందోళనలు 37వరోజు కొనసాగుతున్నాయి. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ ఫోటోకి రైతులు, మహిళలు, రైతు కూలీలు పాలాభిషేకం చేశారు. మానవతా విలువలు కాపాడిన షరీఫ్ గారు,  నీతికి నిజాయితికి నిలబడ్డ షరీఫ్ గారు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.