సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దారుణం... అంధ యువతిని నరికిచంపిన రౌడీషీటర్

Feb 13, 2023, 12:08 PM IST

 అమరావతి : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో అమానుషం జరిగింది. కంటిచూపు లేని ఓ అంద యువతిపై కన్నేసిన ఓ రౌడీ షీటర్ గంజాయి మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు ఈ విషయం బయటపెట్టిందన్న కోపంతో అత్యంత కౄరంగా గొడ్డలితో నరికిచంపాడు. ఈ అమానుషం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లిలో నివాసముండే రౌడీషీటర్ రాజు అందురాలైన 17ఏళ్ల యువతి ఎస్తేరు రాణిపై కన్నేసాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతితో రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఇంటికి వచ్చాక ఈ విషయాన్ని తెలిపింది యువతి. దీంతో యువతి తల్లి, పెద్దమ్మతో పాటు స్థానికులు రాజును నిలదీయగా గంజాయి మత్తులో వున్న అతడు దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో అంద యువతిపై విచక్షణారహితంగా దాడిచేసి ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అంద యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తమ బిడ్డను చంపిన రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.