దారుణం.. పసివాడి మీద దాడి చేసి.. కరిచి చంపిన కుక్కలు..

Jun 3, 2020, 12:14 PM IST

కర్నూలు, ఆళ్లగడ్డలోని పోలీస్ లైన్ వీధిలో నాలుగేళ్ల నరసింహ అనే యాచక బాలుడిపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బిక్షాటన చేస్తూ బతికే నరసింహ అనే బాలుగు మతిస్థిమితం సరిగా లేదు. తల్లితోపాటు జీవిస్తున్నాడు. ఒంగోలు జైలులో ఉన్న తండ్రిని చూడడానికి తల్లి వెళ్లడంతో అర్థరాత్రి నిద్రలేచిన బాలుడు బయట తిరుగుతుండగా కుక్కులు దాడి చేశాయి. అరవడానికి కూడా వీలులేని పరిస్థితిలో అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు చూసి కుక్కలను తరిమేలోపే నరసింహ ప్రాణాలొదిలాడు.