పిల్లలే కాదు పెద్దలు కూడా రెగ్యులర్ గా పాలను తాగుతుంటారు. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. చాలా మంది ఉదయం తాగితే.. మరికొంతమంది రాత్రిపూట పడుకునే ముందు తాగుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ వేడి వేడి పాలనే తాగడానికి ఇష్టపడతారు. కానీ ఎండాకాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే పాలు చల్లారిన తర్వాత తాగితే ఛాతీ, కడుపునొప్పి, హైబీపీ, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అసలు ఎండాకాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.