ఆయనంటే ప్రజలకు అంత నమ్మకం.. విశ్వాసం... అవంతి శ్రీనివాస్

May 30, 2020, 1:30 PM IST

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వస్తుందని ముందుగా ఊహించకపోవడంవల్లే జాగ్రత్తగా ఉండలేదని అన్నారు. వచ్చాక కావాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్బంగా ఈ సమావేశం నిర్వహించారు. మా ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెళ్లిన బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వైద్య పై ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు.