ప్రజలతో కలిసి కాఫీ తాగుతూ..సమస్యలు తెలుసుకున్న రాష్ట్రమంత్రి...

Mar 4, 2020, 12:39 PM IST

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని ఉదయాన్నే పరసుపేటలో ప్రత్యక్షమయ్యారు. సాధారణ టీ స్టాలులో కాఫీ తాగుతూ కాసేపు వృద్దులతో ముచ్చటించారు. పెన్షన్, పేదల ఇళ్లస్థలాలు పంపిణీపై ఆరా తీశారు. స్వయంగా తానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ, అక్కడికక్కడే కొన్నింటిని పరిష్కారించారు.