AP PRC Protest: సచివాలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ... విధులు బహిష్కరించిన భారీ ర్యాలీ

Feb 4, 2022, 2:20 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తూ పీఆర్సీ జీవోలను జారీచేసిందని... వెంటనే ఈ జీవోలను రద్దుచేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరి అస్త్రంగా ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే 7వ తేదీ నుండి సమ్మెకు వెళ్లాల్సి వుండగా వరుసగా 5,6 తేదీలు సెలవుల కావడంతో ఇవాళ్టి(శుక్రవారం) నుండే సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్ చేపట్టి విధులను బహిష్కరించారు. ఈ క్రమంలోనే సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగులంతా భారీ ర్యాలీ నిర్వహించారు.