ఇంటికి పంపించాలంటూ ఎయిర్ పోర్టులో విద్యార్థుల గోల

Mar 24, 2020, 2:43 PM IST

విశాఖ, బోయపాలెం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మంది బీహార్ విద్యార్థినిలు ఈరోజు ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వీరందరూ విశాఖ నుండి హైదరాబాద్ కు అక్కడినుండి పాట్నాకు వెళ్లేందుకు ఉదయం ఐదు గంటలకు ఎయిర్పోర్టుకు వచ్చారు. విమానాలు రద్దయ్యాయని చెప్పినా వినకుండా, ఎలాగైనా పంపించాలంటూ పట్టుబట్టారు. దీంతో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజ కిషోర్ వచ్చి నచ్చజెప్పడంతో విద్యార్థినిలు  బోయపాలెం హాస్టల్ కు వెళ్లిపోయారు.