కృష్ణానది కరకట్ట విస్తరణ... శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Jun 30, 2021, 1:27 PM IST

విజయవాడ: ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్ట  విస్తరణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. రూ. 150 కోట్లతో కరకట్ట విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ఉండవల్లి కొండవీటి వాగు సమీపంలో పైలాన్ ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ను ఇవాళ సీఎం జగన్ ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కృష్ణా నది కరకట్ట పనులు జరగనున్నాయి. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు.