Aug 1, 2020, 3:06 PM IST
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదంపై అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేసీ ఆంధ్రప్రదేశ్ గొంతు కోసిందని విరుచుకుపడ్డారు. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటూ నిలదీస్తున్నారు. వైసీపీతో కలిసి పవన్ కల్యాణ్ అమరావతికి అన్యాయం చేశాడంటూ పవన్ కల్యాణ్ ఇక తన పార్టీ పేరు వైసీపీ జేపీ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు