Feb 15, 2020, 1:40 PM IST
తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న లారీనీ టాటా ఏసీ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.