నందిగామ ఎమ్మార్వో ఆఫీసులో ఏసిబి దాడులు...తహసీల్దార్ కారులోనూ తనిఖీ

Dec 10, 2021, 1:25 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండల రెవెన్యూ అధికారి (MRO Office) కార్యాలయంలో ఏసిబి (Anti Corruption Bureau) అధికారులు దాడులు చేపట్టారు. తహసీల్దార్ చంద్రశేఖర్  కారులో కూడా ఏసిబి తనిఖీ చేపట్టింది. ఇద్దరు డిఎస్పి స్ధాయి అధికారుల ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. తహసిల్దార్  నుండి వివరాలను ఎసిబి అధికారులు సేకరిస్తున్నారు.