కువైట్ నుండి ఆంధ్రాకు.. 120 మంది తెలుగువాళ్లు..

Jun 4, 2020, 10:46 AM IST

కువైట్ లో చిక్కుకుపోయిన ఏపీలోని వివిధ జిల్లాల తెలుగువారు గతరాత్రి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కువైట్ ఎయిర్ లైన్స్ విమానంలో బుధవారం రాత్రి 120 మంది తెలుగువారు విశాఖ చేరుకున్నారు. వీరందరికీ  కరోనా పరీక్షలు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ చెకింగ్ చేసిన తరువాత గవర్నమెంట్, పెయిడ్ క్వారెంటైన్ లకు బస్సుల్లో తరలించారు.