టాలీవుడ్ డ్రగ్స్ కేసు: తెరపైకి ఎఫ్ క్లబ్ పాత్ర, ఆ ఇద్దరి పేర్లు ఈడీ విచారణలోకి ఇలా...

By narsimha lodeFirst Published Sep 3, 2021, 11:02 AM IST
Highlights


లాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైద్రాబాద్ ఎఫ్ క్లబ్ పాత్ర తెరమీదికి వచ్చింది. నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ మేనేజర్ కి కూడ ఈడీ నోటీసులు పంపింది. ఎఫ్ క్లబ్ నిర్వహించిన పార్టీకి రకుల్‌ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలు కూడా హాజరయ్యారని సమాచారం.

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు.  నటుడు నవదీప్ నడుపుతున్న  ఎఫ్ క్లబ్‌లో  నిర్వహించిన పార్టీలో రకుల్‌ప్రీత్ సింగ్, రానా పాల్గొన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.ఈడీ అధికారుల విచారణకు ఇవాళ  రకుల్‌ప్రీత్ సింగ్ హాజరయ్యారు. నవదీప్ నడుపుతున్న ఎఫ్ క్లబ్  మేనేజర్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ క్లబ్ నిర్వహించిన పార్టీకి  రకుల్‌ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలు హజరైనట్టుగా ఈడీ అధికారలు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఈ సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన రకుల్‌ప్రీత్‌సింగ్

ఎఫ్ క్లబ్ పార్టీలో పలువురికి కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా  ఈడీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చినట్టుగా సమాచారం. రకుల్‌ప్రీత్ సింగ్, నవదీప్, కెల్విన్  మధ్య  వ్యవహరంపై ఈడీ ఆరా తీయనుంది.  ఎఫ్ క్లబ్ మేనేజర్ కు కూడ ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు పంపారు.  బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు కూడ రకుల్‌ప్రీత్ సింగ్ హాజరయ్యారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసును  ఎక్సైజ్ శాఖ  విచారించింది. ఈ సమయంలో దగ్గుబాటి రానా, రకుల్‌ప్రీత్ సింగ్ ల పేర్లు లేవు. అయితే  ఈడీ అధికారులు మాత్రం ఈ ఇద్దరి పేర్లను కూడా చేర్చారు. ఈడీ అధికారులు సినీ నటుల బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ నిర్వహిస్తున్నారు.
 

click me!