టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన రకుల్ప్రీత్సింగ్
ఈడీ విచారణకు సినీ నటి రకుల్ప్రీత్సింగ్ హాజరయ్యారు. రకుల్ప్రీత్ సింగ్ వెంట మరో ఇద్దరు ఉన్నారు. బ్యాంకు స్టేట్మెంట్లను కూడా తీసుకురావాలని ఈడీ అధికారులు ఇప్పటికే ఆమెను కోరారు.
హైదరాబాద్: ఈడీ విచారణకు ప్రముఖ సినీ నటి రకుల్ప్రీత్ సింగ్ శుక్రవారం నాడు హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీన రకుల్ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆ రోజున విచారణకు తాను హాజరు కాలేనని రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ అధికారులకు సమాచారం పంపారు. తనను మరో రోజున విచారించాలని ఆమె కోరింది.
also read:డ్రగ్స్ కేసు :ఈడీ అధికారులకు రకుల్ రిక్వెస్ట్,ఈ రోజే విచారణ
అయితే ఇవాళ విచారణకు రావడానికి సినీ నటి రకుల్ప్రీత్ సింగ్ అంగీకరించారు. దీంతో ఇవాళ ఉదయాన్నే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు. ఉదయం 10 గంటలకు ఈడీ అధికారులు వస్తారు. అయితే అధికారులు రావడానికి కనీసం అరగంట ముందే ఆమె ఈడీ కార్యాలయానికి వచ్చారు. రకుల్ప్రీత్ సింగ్ విచారణకు రానున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసును తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గతంలో విచారించింది. ఈ విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులు రకుల్ప్రీత్ సింగ్ ను విచారించలేదు. రకుల్ ప్రీత్ సింగ్ సహా దగ్గుబాటి రానాలకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్ ఈడీకి అఫ్రూవర్ గా మారాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా సినీ తారలను బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారిస్తున్నారు.
సినీ తారలు ఫెమో నిబంధనలను ఉల్లంఘించారని కూడ ఈడీ గుర్తించింది. ఈ విషయాలపై బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు రకుల్ప్రీత్ సింగ్ ను విచారించే అవకాశం ఉంది.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ విచారణకు హాజరైంది.ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ప్రముఖ నటి ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు.