డ్రగ్స్ కేసు: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Nov 12, 2020, 12:51 PM IST
Highlights

  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గురువారం నాడు హైకోర్టు ఆదేశించింది.గురువారం నాడు డ్రగ్స్ కేసు విషయమై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.


హైదరాబాద్:  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గురువారం నాడు హైకోర్టు ఆదేశించింది.గురువారం నాడు డ్రగ్స్ కేసు విషయమై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సంచలన విషయాలు వెల్లడించిన రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి

డ్రగ్స్ కేసుపై లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉండే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.2017లో ఈ కేసుపై రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గురువారం నాడు హైకోర్టు ఆదేశించింది. గురువారం నాడు డ్రగ్స్ కేసు విషయమై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

ఈ కేసు విచారణకు  ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ ఎన్ సీబీ సంస్థలకు అప్పగించాలని  ఆయన ఆ పిల్ లో కోరారు.రేవంత్ రెడ్డి తరపున ప్రముఖ లాయర్ రచనా రెడ్డి హైకోర్టులో వాదించారు. డ్రగ్స్ కేసు  విచారణకు ఈడీ, ఎన్ సీబీ సిద్దంగా ఉన్నాయని లాయర్ రచనా రెడ్డి  ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఈడీ, ఎస్ సీ బీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని ఆమె వాదించారు. సిట్ దర్యాప్తు పరిస్థితిపై డిసెంబర్ 10 లోపు తెలపాలని  ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది.

click me!