Telangana High Court: తెలంగాణలో హైకోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. నూతన సంవత్సరంలో (వచ్చే జనవరిలో)నే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేడు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (MCRHRD) చీఫ్ జస్టిస్, న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.