కోరిక తీరిస్తే రూ.25వేలిస్తా...: రంగారెడ్డి జిల్లాలో మహిళా డాక్టర్ పై లైంగిక వేధింపులు

By Arun Kumar PFirst Published Sep 20, 2021, 12:38 PM IST
Highlights

ఓ మహిళా డాక్టర్ ను కోరిక తీర్చమంటూ వేధిస్తున్న ఓ దుర్మార్గుడిపై మెయినాబాద్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, నిర్భయ కేసు నమోదు చేసారు. 

రంగారెడ్డి: ఇటీవలే సైదాబాద్ లో చిన్నారిపై అఘాయిత్యానకి పాల్పడిన నిందితుడు కుక్కచావు చచ్చాడు. గతంలో కూడా హైదరాబాద్ శివారులో దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ఇలా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుల భరతం పడుతున్నారు పోలీసులు. అయినప్పటి కొందరు మృగాల్లలో మాత్రం మార్పురావడం లేదు. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వేధింపులకు దిగుతున్నారు. ఇలా హైదరాబాద్ శివారులో ఓ ఆర్ఎంపి డాక్టర్ వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు ఓ దుర్మార్గుడు. 

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఆర్ఎంపీగా పనిచేస్తోంది. స్థానికంగా ఓ క్లినిక్ ను నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తోంది. అయితే ఆమెపై అదే గ్రామానికచెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కన్నుపడింది. వైద్యం పేరిట క్లినిక్ వెళ్లి ఆర్ఎంపి నంబర్ తీసుకున్న అతడు ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ వేధించసాగాడు. 

read more  సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: ఆటోలో చోరీకి నిందితుడు రాజు యత్నం

యువతి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల మరోసారి క్లినిక్ వెళ్లాడు. తన కోరిక తీర్చాలని... అందుకోసం ఎంత డబ్బయినా ఇస్తానంటూ అసభ్యంగా మాట్లాడాడు. కేవలం ఒక్క ముద్దు ఇస్తే రూ.25వేలు ఇస్తానని... క్లినిక్ అద్దెను కూడా తానే కడతానంటూ అసభ్యంగా మాట్లాడాడు. 

తనను ప్రసాద్ రెడ్డి వేధిస్తున్న విషయాన్ని సదరు ఆర్ఎంపీ డాక్టర్ కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో అతడి ఇంటికి వెళ్లగా అప్పటికే అతడు పరారయ్యాడు. దీంతో వెంటనే యువతి కుటంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు ప్రసాద్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిర్భయ కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం నిందితుడు పరారీలో వున్నాడని... అతడి కోసం రెండు బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!