దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి యువతులను రప్పిస్తూ... హైటెక్ పద్దతుల్లో టెకీలను ఆకర్షిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: సాంకేతికత సాయంతో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నఓ హైటెక్ ముఠా గుట్టు రట్టయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీ ప్రాతంలో ఈ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి యువతులను రప్పిస్తూ... హైటెక్ పద్దతుల్లో టెకీలను ఆకర్షిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.
మాదాపూర్ లోని ఓ హోటల్లో గుట్టుగా వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు హోటల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు చెందిన ముగ్గురు యువతులతో పాటు డిల్లీకి చెందిన మరో ఇద్దరు అమ్మాయిలు, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దగల రూ.20వేల నగదు,సెల్ ఫోన్లతో పాటు కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ పోలీసుల తనిఖీలో వ్యభిచార ముఠా నిర్వహకులు మాత్రం తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.