మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం.. ఏడుగురికి రిమాండ్..!

By telugu news teamFirst Published Sep 2, 2021, 8:55 AM IST
Highlights

ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కి తరలించారు.


మసాజ్ సెంటర్ పేరిట హైదరాబాద్ నగరంలో  వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాగా.. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కి తరలించారు.  కాగా.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఐ లక్ష్మీ నారాయణ వెల్లడించారు.

కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్‌–1లోని ఆర్‌ఏ స్పా అండ్‌ మసాజ్‌ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్‌ అక్బర్‌ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.  

click me!