యువతి ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మొయిల్, రేప్.. గర్భం రాగానే...

By ramya NFirst Published Apr 8, 2019, 11:28 AM IST
Highlights

స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని.. తర్వాత ప్రేమిస్తున్నానని మాయమాటలు  చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఆమెకు తెలియకుండా ఫోటోలు తీసుకొని బలవంతంగా ఆమెను అనుభవించాడు.

స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని.. తర్వాత ప్రేమిస్తున్నానని మాయమాటలు  చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఆమెకు తెలియకుండా ఫోటోలు తీసుకొని బలవంతంగా ఆమెను అనుభవించాడు. తీరా ఆమె గర్భవతి కాగానే.. మళ్లీ బెదిరించి అబార్షన్ చేయించాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరం మల్కాజ్ గిరిలో  చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్ గిరి కిచెందిన యువతి(23) బోడుప్పల్ లోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. కాగా.. ఆమెకు ఓ స్నేహితురాలు ఉంది. ఆమె సోదరుడు సాయితేజ(27) చెల్లిని కాలేజీకి డ్రాప్ చేసే క్రమంలో సదరు యువతితో పరిచయం పెంచుకున్నాడు.

తొలుత స్నేహం పేరిట పరియం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. యువతికి తెలియకుండా ఆమె ఫోన్ లో ఓ యాప్ ని ఇన్ స్టాల్ చేశాడు. ఆ  యాప్ సహాయంతో యువతి ప్రైవేటు ఫోటోలను సేకరించాడు. ఆ ఫోటోలను చూపించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

తనతో శృంగారంలో పాల్గొనకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో.. యువతి అతినికి లొంగి పోయింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు. ఇలా మూడుసార్లు యువతికి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరినా... చేసుకోకుండా ఫోటోలతో బెదిరింపులు తీవ్రతరం చేశాడు.

దీంతో.. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి తేజను అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. 

click me!