న్యూఇయర్కు ముందు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. సరూర్నగర్లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. మత్తు కలిగించే హషీశ్ ఆయిల్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు
న్యూఇయర్కు ముందు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. సరూర్నగర్లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. మత్తు కలిగించే హషీశ్ ఆయిల్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు.
నిందితులు అమీర్పేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు. నిందితుల నుంచి 1500 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అరకు నుంచి మత్తు మందు తెస్తున్న ఓ ముఠా.. విద్యార్ధులకు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురిని రిమాండ్కు తరలించారు రాచకొండ పోలీసులు.