త్వరలో వరల్డ్ కప్.. టీం ఇండియాకి ఊహించని షాక్

By telugu teamFirst Published May 6, 2019, 10:20 AM IST
Highlights

త్వరలో ప్రపంచకప్ జరగనున్న సమయంలో టీం ఇండియాకి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ 12 సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 

త్వరలో ప్రపంచకప్ జరగనున్న సమయంలో టీం ఇండియాకి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ 12 సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఓ బౌండరీని ఆపబోయి జాదవ్ గాయపడ్డాడు. దీంతో అతన్ని మైదానం నుంచి తరలించారు.

ఈ గాయం నుంచి జాదవ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో జాదవ్... ఐపీఎల్ కి దూరమైనట్టే... వరల్డ్ కప్ కి కూడా దూరం అవుతాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.

జాదవ్ కి తగిలిన గాయం గురించి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘‘కేదార్‌కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించాము. రేపు అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. అతను కోలుకుంటాడని కోరుకుంటున్నా. అతన్ని ఇక జట్టులోకి తీసుకోము. ఎందుకంటే వరల్డ్ కప్‌ కోసం అతను ఫిట్‌గా ఉండటం ముఖ్యం. అది అంత పెద్ద గాయంలా కనిపించడం లేదు. కానీ మంచి జరగాలనే కోరుకుంటున్నాం’’ అని తెలిపాడు.
 
దీంతో టీం ఇండియా కష్టాల్లోపడినట్లు కనిపిస్తుంది. ఒకవేళ అతను కోలుకోకుంటే.. స్టాండ్‌-బేలో ఉన్న అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

click me!