టీం ఇండియా ఫోటో షేర్ చేసిన బీసీసీఐ.. బుమ్రా పై ఫన్నీ మీమ్స్

By ramya neerukondaFirst Published Nov 1, 2018, 4:03 PM IST
Highlights

బూమ్రా మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం బ్రూమానే ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఆ ఫోటోలో క్రికెటర్లంతా ఫోన్లతో బిజీగా ఉంటే.. బూమ్రా మాత్రమే ఖాళీగా కూర్చొని ఉన్నాడు.

టీం ఇండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రా పై ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు. బీసీసీఐ చేసిన ఓ ట్వీట్ కారణంగా ఇప్పుడు బ్రూమా పై మీమ్స్ వర్షం కురుస్తోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... సోమవారం రోజు టీం ఇండియా ఆటగాళ్లు.. ముంబయి ఎయిర్ పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తుండగా తీసిన ఓ ఫోటోని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది.  అయితే.. ఆ ఫోటోలో ఆటగాళ్లంతా ఫోన్ లో బిజీ బిజీగా మునిగిపోయి ఉన్నారు. ఆ ఫోటోకి క్యాప్షన్ గా క్రికెటర్లంతా ఫోన్ లో గేమ్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ గేమ్ ఏం అనుకుంటున్నారు..? అని నెటిజన్లను ప్రశ్నించారు.

ఆ ట్వీట్ చేసిన రెండు రోజులకు దానికి రెస్పాన్స్ బాగా వచ్చింది. చాలామంది నెటిజన్లు..  PUBGగేమ్ ఆడుతున్నారంటూ కామెంట్ చేశారు. అక్కడితో ఆగలేదు. బ్రూమాపై మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం బూమ్రానే ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఆ ఫోటోలో క్రికెటర్లంతా ఫోన్లతో బిజీగా ఉంటే.. బూమ్రా మాత్రమే ఖాళీగా కూర్చొని ఉన్నాడు.

ఇక అంతే ఫన్నీ ఫన్నీ మీమ్స్ పుట్టుకువచ్చాయి. ఒక నెటిజన్‘‘ ఫ్యామిలీ గెటూ గెదర్ లో ఒకే ఒక్క చిన్న పిల్లాడు బూమ్రా వెళ్లాడు. అక్కడ బ్రూమాకి తప్ప అందరికీ ఫోన్ ఉంది’’ అంటూ కామెంట్ చేయగా..‘‘ ఫోన్ లో బ్యాటరీ అయిపోయి..పవర్ బ్యాంక్ మర్చిపోతే ఇలానే ఉంటుంది’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

As we wait for the departure announcement from Mumbai, some of them are playing a very popular multiplayer game.

Any guesses? pic.twitter.com/Y1n8AdHxhn

— BCCI (@BCCI)

‘‘మీ ఫ్రెండ్స్ అందరూ PUBG గేమ్ ఆడుతూ బిజీగా ఉన్నప్పుడు.. మీ ఫోన్ లో మాత్రం బ్యాటరీ 2శాతమే ఉంటే.. ఇలా ఉంటుందని’’ బూమ్రా ఫోటోని షేర్ చేస్తున్నారు మరికొందరు. ఇలా నెటిజన్లు రకరకాల మీమ్స్ తయారు చేయగా.. అవి సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. 

click me!