ఛత్తీస్‌ఘడ్‌లో వివాహితపై గ్యాంగ్‌రేప్: ముగ్గురు అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 15, 2021, 11:50 AM IST
Highlights

చత్తీష్ ఘడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. వివాహితపై ముగ్గురు బ్యాంగ్ రేప్ కు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
 

రాయ్‌పూర్:Chhattisgarh రాష్ట్రంలోని Janjgiri జిల్లాలో వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబుతుందనే ఉద్దేశ్యంతో బాధితురాలిని హత్య చేశారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అకల్తారా ప్రాంతానికి చెందిన చంద్రమణి వైష్ణవ్, సురేంద్ర శ్రీవాస్, శివదాస్ మహంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై అత్యాచారం, హత్యతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  నిందితులను జ్యూడిషీయల్  రిమాండ్ కు పంపారు.

also read:బాత్‌రూమ్‌లో బంధించి యువతిపై గ్యాంగ్ రేప్: ఒకరి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు

akaltaraలోని తారౌడ్ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని వెలికితీసిన తర్వాత మృతదేహంపై ఉన్న చీర ఆధారంగా మృతురాలు అకల్తారా‌లోని 20వ వార్డుకు చెందిన మహిళగా గుర్తించారు. మహిళ ముఖం గుర్తు పట్టలేనంతగా చిద్రం చేశారు. శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని పోస్టు మార్టం రిపోర్టులో తేలింది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయడంతో చంద్రమణి వైష్ణవ్ మహిళ ఇంటికి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలిని ఈ నెల 9వ తేదీన వైష్ణవ్ తన బైక్ పై తీసుకెళ్లాడని స్థానికులు కూడా ధృవీకరించారు. 

నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మృతురాలిపై వైష్ణ్ సహా మరో ఇద్దరు gang rape కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు చెప్పింది. దీంతో నిందితులు ఆమె చీరెతోనే ఉరి వేసి చంపారు. ఆ తర్వాత ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ముఖంపై రాయితో కొట్టారు. ఆ తర్వాత గోనెసంచిలో మృతదేహన్ని తీసుకెళ్లి కాలువలో వేశారు.మృతురాలిని ప్రేమించానని చంద్రమణి అనే నిందితుడు వేధింపులకు గురిచేశాడు.  చంద్రమణితో పాటు వైష్ణవ్, శివలను పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!