బాత్రూమ్లో బంధించి యువతిపై గ్యాంగ్ రేప్: ఒకరి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు
ఢిల్లీలో యువతిని బాత్రూమ్లో బంధించి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు నిందితులు. బాధిత యువతిని బెదిరించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
న్యూఢిల్లీ: Bath roomలో బంధించి ఓ woman పై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
also read:హైద్రాబాద్ రాజేంద్రనగర్లో గ్యాంగ్ రేప్: నిందితుల కోసం పోలీసుల గాలింపు
యువతి స్నానం చేసేందుకు వెళ్తున్న సమయంలో ఇద్దరు నిందితులు ఇంట్లోకి వచ్చి ఆమెను బాత్రూమ్లోనే బంధించి gang rape పాల్పడ్డారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులకు చెప్పింది. బాధితురాలిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిపు చర్యలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమతో నమ్మకంగా ఉంటూనే తమ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేయడంపై బాధిత యువతి పేరేంట్స్ ఆగ్రహంగా ఉన్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యాచారాల ఘటనలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడ నిందితులు మాత్రం తగ్గడం లేదు. నిందితులకు శిక్షలు త్వరగా అమలయ్యేలా చేస్తే ఈ తరహ ఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితులుండవని వాదించేవారు కూడ లేకపోలేదు.అయితే చిన్నతనం నుండే పిల్లల పెంపకం లో జాగ్రత్తలు పాటిస్తే కూడ ఈ తరహ ఘటనలు తక్కువగా చోటు చేసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.