ఆటోలో ఎత్తుకెళ్లి అమ్మాయిపై నలుగురు గ్యాంగ్ రేప్

By telugu teamFirst Published Apr 3, 2019, 8:05 AM IST
Highlights

శనివారం సాయంత్రం చిన్నకంచిలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న 15 ఏళ్ల వయస్సు గల అమ్మాయిని ఆటో డ్రైవర్, అతని ముగ్గురు మిత్రులు కిడ్నాప్ చేశారు. ఆటోలో అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో పొదల్లోకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. 

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని అమ్మాయిని అపహరించి, నిర్బంధించి, నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

శనివారం సాయంత్రం చిన్నకంచిలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న 15 ఏళ్ల వయస్సు గల అమ్మాయిని ఆటో డ్రైవర్, అతని ముగ్గురు మిత్రులు కిడ్నాప్ చేశారు. ఆటోలో అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో పొదల్లోకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. 

తమ కూతురు కనిపించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు విష్ణు కంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అమ్మాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాంచీపురంలోని తిరుకలిమేడులోని పొదల్లో అమ్మాయి స్పృహ తప్పి పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

పోలీసులు బాధితురాలిని కాంచీపురం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని తేల్చారు. దాంతో పోలీసులు కేసును కాంచీపురానికి బదిలీ చేసి, అన్ని మహిళా పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. 

బాలికను కిడ్నాప్ చేయడానికి ఆటోను వాడినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. దాంతో ఆటో యజమాని రాజా (25)ను, అతని మిత్రుడు దేవ (27)ను పట్టుకున్నారు. ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

click me!