‘‘కళ్లెదురుగా భర్తను కొడుతుంటే.. ఏ భార్య అయినా ఊరుకుంటుందా..?’’ కట్ చేస్తే..

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 12:12 PM IST
Highlights

ప్రియుడిని పెళ్లాడాలని కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు వివాహిత కుట్ర పన్ని అడ్డంగా బుక్కైపోయింది.  జమీన్ పల్లవరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కదిరవన్‌కి తూత్తుకుడికి చెందిన అనితతో నెల రోజుల క్రితం పెళ్లయ్యింది. 

ప్రియుడిని పెళ్లాడాలని కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు వివాహిత కుట్ర పన్ని అడ్డంగా బుక్కైపోయింది.  జమీన్ పల్లవరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కదిరవన్‌కి తూత్తుకుడికి చెందిన అనితతో నెల రోజుల క్రితం పెళ్లయ్యింది.

వీకెండ్ కావడంతో కొత్తజంట గత శనివారం సాయంత్రం తిరువాన్మియూర్ బీచ్‌కు వెళ్లి.. రాత్రి కావడంతో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వీరి బైక్‌ను ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని ఇనుప రాడ్లతో కదివరన్‌పై దాడి చేయడంతో అతను బైక్ నుంచి కిందపడిపోయాడు.

అనంతరం అతని భార్య ఒంటిపై ఉన్న 12 సవర్ల నగలు, కదివరన్‌ నుంచి రూ.1,000 నగదు తీసుకుని దుండగులు పరారయ్యారు. గాయపడిన కదివరన్‌ను ఆస్పత్రిలో చేర్పించి అనంతరం అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా తిరువాన్మియూర్ బీచ్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు. భర్తపై దాడి జరుగుతున్నా అనితలో ఎలాంటి స్పందన లేకుండా బొమ్మలా నిలబడి చూస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

అనిత కాలేజీలో చదివే రోజుల్లో జగన్ అనే వ్యక్తిని ప్రేమించింది.. వారిద్దరూ వివాహం చేసుకోవాలనే సమయంలో ఆమె తల్లిదండ్రులు కదిరవన్‌తో పెళ్లి జరిపించారు. దీంతో భర్తను హత్య చేసి అనంతరం ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జగన్‌తో కలిసి కదిరవన్ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది.. దీంతో అనితతో పాటు జగన్‌ను అరెస్ట్ చేసి మధురైకి తరలించారు. 

click me!