మంత్రి రాసలీలల కేసు.. యువతి కోసం హైదరాబాద్ లో గాలింపు

By telugu news teamFirst Published Mar 16, 2021, 1:47 PM IST
Highlights

రాసలీలల వీడియోలో కనిపించే యువతి కోసం గాలింపు మొదలుపెట్టారు. ముందుగా... ఈ వీడియో బయటకు రాగానే.. యువతి గోవా వెళ్లిందనే సమాచారం అందింది. 

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాసలీలల వీడియోలో కనిపించే యువతి కోసం గాలింపు మొదలుపెట్టారు. ముందుగా... ఈ వీడియో బయటకు రాగానే.. యువతి గోవా వెళ్లిందనే సమాచారం అందింది. అక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. కాగా.. గోవా నుంచి ఆమె బెంగళూరుకి.. అక్కడి నుంచి ముంబయికి.. అక్కడి నుంచి తిరుపతి ఆ తర్వాత హైదరాబాద్ కి చేరినట్లు సమాచారం అందింది.

ఈ క్రమంలో ఆమె కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. తనను మోసగించారని, బెదిరించారని మాజీ మంత్రిపై యువతి సోషల్‌ మీడియా ద్వారా బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విచారణకు రావాలని బాగల్‌కోటలో ఆమె ఇంటికి నోటీసులు అతికించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేదు.  

ఖాతాలోకి 25 లక్షలు: ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీడీని సామాజిక కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి అందజేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.25 లక్షల నగదు జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు. వీడియోలో వినిపించిన గొంతు మీద అనుమానంతో  చిక్కమగళూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు

click me!